
Operation Sindoor: India’s Measured Strike
ఉగ్ర స్థావరాలపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్రీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం,, మరోసారి ఉగ్రదాడులు జరగబోతున్నట్టు స్పష్టమైన సూచనలు లభించాయన్నారు. అందుకే భారత్ నిగ్రహంగా, పరిమితంగా, ఉగ్ర స్థావరాలపై దాడులు జరిగినట్టు చెప్పారు. పహల్గామ్ ఉగ్రదాడికి బాధ్యత వహించినవారిని శిక్షించాల్సిన అవసరం ఉందని, అయితే ఇప్పటివరకు పాకిస్తాన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆక్షేపించారు.