
హైకోర్టు కంటే అసెంబ్లీకే ఎక్కువ.. అమరావతిలో ఏం జరుగుతోంది?
అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేర్వేరు టెండర్లను జారీ చేసింది. L&T ఒక టెండర్ రూ.5,500 చొప్పున చదరపు యార్డ్ ధరతో ఇచ్చారు. అదే సమయంలో ఎన్సీసీకి (NCC) మరో టెండర్ రూ.4,000 కన్నా తక్కువ ధరతో కేటాయించారు. ఇంత భారీ ధరల తేడా ఎందుకు? దీనిపైనే ఇప్పుడు పెద్ద చర్చ మొదలైంది. ఇందులో ఏదైనా రహస్య అజెండా ఉందా? అమరావతిలో జరుగుతున్న నిర్మాణాల వెనుక నిజమెంత? ఈ టెండర్ వ్యవహారాలు భవిష్యత్ అమరావతిపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకోండి.