
అమరావతిలో పనులు మొదలవడంతో జగన్ మూఠాలో వేదన: ఉండవల్లి శ్రీదేవి
అమరావతి పున:నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగిందని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ప్రపంచానికి ధీటైన రాజధాని నిర్మించబోతున్నామన్నారు. ఇందుకు చంద్రబాబు ప్రతిష్ట, కష్టం చాలా ఉందని... ఇందులో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ల కృషి కూడా ఎనలేనిదని ప్రశంసించారు. రాజధాని పనులు ప్రారంభమైనప్పటి నుంచి జగన్, జగన్ ముఠా గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ప్రారంభమైందని విమర్శించారు.