Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం... మహిళా రైతులతో ఆత్మీయంగా పలకరిస్తూ సాగిన పాదయాత్ర

రంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రాన్ని కాలినడకన చుట్టివచ్చేందుకు ఇటీవలే వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. 

రంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రాన్ని కాలినడకన చుట్టివచ్చేందుకు ఇటీవలే వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. చేవెళ్లలో ప్రారంభమైన YS Sharmila పాదయాత్ర ఇవాళ(శుక్రవారం) ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కొనసాగుతోంది. పదో రోజు సీతంపేట గ్రామంలోకి ప్రజాప్రస్థానం మహా పాదయాత్ర ప్రవేశించింది. అభిమానులు, స్థానికులు, YSRTP నాయకులు, కార్యకర్తల వెనకరాగా షర్మిల ముందునడిచారు. జోహార్ YSR, జై షర్మిలమ్మ అంటూ నినాదాల హోరుతో పాదయాత్ర సాగుతోంది. మహిళా రైతుల సమస్యలు తెలుసుకుంటూ, వారితో ఆత్మీయంగా పలకరిస్తూ షర్మిల పాదయాత్ర చేస్తున్నారు.