Asianet News TeluguAsianet News Telugu

రాజన్న భక్తులకు గుడ్ న్యూస్... ఏళ్ల తర్వాత తెరుచుకున్న వేములవాడ ధర్మగుండం

వేములవాడ : తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి సన్నిధిలోని ధర్మగుండం మూడేళ్ల తర్వాత మళ్ళీ తెరుచుకుంది. కరోనా కారణంగా ధర్మగుండంలో స్నానానికి భక్తులను అనుమతించని ఆలయ సిబ్బంది. 

వేములవాడ : తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి సన్నిధిలోని ధర్మగుండం మూడేళ్ల తర్వాత మళ్ళీ తెరుచుకుంది. కరోనా కారణంగా ధర్మగుండంలో స్నానానికి భక్తులను అనుమతించని ఆలయ సిబ్బంది. ప్రస్తుతం కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిపోవడంతో తిరిగి ధర్మగుండాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆలయ అర్చకులు, అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొదట స్వామివారిని అభిషేకించాకే భక్తుల స్నానాలకు అనుమతించారు.