Asianet News TeluguAsianet News Telugu

జగిత్యాలలో ఉద్రిక్తత.. ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు రోజుల చిన్నారి మృతి...

జగిత్యాల : జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్ ప్రభుత్వాసుపత్రిలో రెండు రోజుల క్రితం పుట్టిన చిన్నారి మృతి చెందింది. 

జగిత్యాల : జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్ ప్రభుత్వాసుపత్రిలో రెండు రోజుల క్రితం పుట్టిన చిన్నారి మృతి చెందింది. మల్లాపూర్ మండలం వల్గొండ గ్రామానికి చెందిన లాస్య అనే గర్భిణీ నిన్న ఉదయం పండంటి పాపకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన పాపకు అనారోగ్యంగా ఉండడంతో ఆసుపత్రి వైద్యులు పిల్లల వార్డ్ లో చికిత్స అందించారు. అయితే, ఈ రోజు ఉదయం పరిస్థితి విషమించింది. దీంతో ఆసుపత్రి సిబ్బంది అంబులెన్స్ లో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పాప మృతి చెందిందని నిర్దారించారు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం చిన్నారి నిన్ననే వైద్యుల నిర్లక్ష్యంతో చనిపోయిందని ఆసుపత్రి ఎదుట ఆందోళన కు దిగారు.