Asianet News TeluguAsianet News Telugu

ప్రధానికే చేతకావడం లేదు... కానీ ఆ పని చేస్తున్న మొగోడు కేసీఆర్..: ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి

హుజురాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోయే రోజుల్లో దేశానికి నాయకత్వం వహించడం పక్కా అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.

హుజురాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోయే రోజుల్లో దేశానికి నాయకత్వం వహించడం పక్కా అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రతి రైతుకు ఉచిత విద్యుత్ అందించాలని కేసీఆర్ భావిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం దేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు ఒక్క తెలంగాణలోనే అమలవుతున్నాయని... ఈ ఘనత సీఎం కేసీఆర్ దే అని పేర్కొన్నారు. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ లో కేవలం రూ.600వందల పెన్షన్ ఇస్తుంటే తెలంగాణలో మాత్రం 2000,3000 వేల పెన్షన్ ఇస్తున్న మొగోడు కేసీఆర్ అని అన్నారు. సిఎం కేసీఆర్ గత ఎనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లే ఈ దేశాన్ని కూడా అభివృద్ధి చేయలని కోరుకుంటున్నానని కౌశిక్ రెడ్డి తెలిపారు.