Asianet News TeluguAsianet News Telugu

సనత్ నగర్ లో వాణిదేవి ఎన్నికల ప్రచారం

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి అధికార టీఆర్ఎస్ తరపున మాజీ ప్రధాని పివి నరసింహరావు కూతురు సురభి వాణీదేవి పోటీచేస్తున్న విషయం తెలిసిందే. 

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి అధికార టీఆర్ఎస్ తరపున మాజీ ప్రధాని పివి నరసింహరావు కూతురు సురభి వాణీదేవి పోటీచేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇవాళ(గురువారం) ఉదయం ఆమె సనత్ నగర్ లోని శ్యామలకుంట పార్క్ లో ప్రచారం నిర్వహించారు. అక్కడికి వచ్చిన వాకర్స్ తో మాట్లాడిన వాణిదేవి తనకు ఓటేయాలని కోరారు. ఈ ప్రచారంలో  మంత్రులు గంగుల కమలాకర్ , తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పాల్గొన్నారు.