Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ సమరయోధులకు స్మరించుకుంటూ... భారత స్వతంత్ర వజ్రోత్సవాలను ప్రారంభించిన కేసీఆర్ సర్కార్

భారతదేశానికి బ్రిటీష్ పాలకుల నుండి స్వాతంత్ర్యం లభించి ఈ ఏడాదితో 75ఏళ్ళు పూర్తికావస్తోంది.

భారతదేశానికి బ్రిటీష్ పాలకుల నుండి స్వాతంత్ర్యం లభించి ఈ ఏడాదితో 75ఏళ్ళు పూర్తికావస్తోంది. ఈ సందర్భంగా ఈసారి స్వాతంత్య్ర వేడుకలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుండగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఇవాళ్టి (సోమవారం)నుండి భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల నిర్వహణకు సిద్దమయ్యింది. ఇవాళ హైదరాబాద్ హెచ్ఐసిసి లో సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఈ వజ్రోత్పవ వేడుకలను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా భారత స్వాతంత్ర్య సంగ్రామం, తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న అమరవీరులకు గుర్తుచేసుకుంటూ తెలంగాణ ప్రభుత్వం ఓ వీడియోను విడుదల ,చేసింది.