బీజేపీ నేత రఘునందన్ రావుపై లైంగిక వేధింపుల కేసు : హెచ్చార్సీలో నమోదు
బీజేపీ నేత రఘునందన్ రావు తనపై శారీరక, మానసిక హింసకు గురి చేస్తున్నాడని రాధారమణి మహిళ సైబరాబాద్ సీపీ సజ్జనార్కు ఫిర్యాదు చేసింది.
ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన బీజేపీ నేత రఘునందన్ రావు తనపై శారీరక, మానసిక హింసకు గురి చేస్తున్నాడని రాధారమణి మహిళ సైబరాబాద్ సీపీ సజ్జనార్కు ఫిర్యాదు చేసింది. టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు, బీజేపీలో ఉన్నప్పుడు తాను అధికార ప్రతినిధి అని కేసుపెట్టకుండా చేశాడని..ఉద్యోగం రాకుండా, షాపు నడవకుండా చేస్తున్నాడని వాపోయింది. తనకు న్యాయం కావాలని హెచ్చార్సీని ఆశ్రయించింది. హెచ్చార్సీ ఆదేశాల మేరకు సీపీ సజ్జనార్ కు ఫిర్యాదు చేసింది.