Asianet News TeluguAsianet News Telugu

బతికుండగానే చంపేశారు.. యశోదా హాస్పిటల్ లో దారుణం.. (వీడియో)

కరోనా రోగుల పట్ల హైదరాబాద్‌ కార్పోరేట్ ఆసుపత్రుల ఆగడాలు రోజు రోజుకూ మితిమీరుతున్నాయి. 

కరోనా రోగుల పట్ల హైదరాబాద్‌ కార్పోరేట్ ఆసుపత్రుల ఆగడాలు రోజు రోజుకూ మితిమీరుతున్నాయి. తాజాగా సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో దారుణం జరిగింది. అంబర్‌పేట్‌కు చెందిన సి. నరసింగరావు అనే వ్యక్తికి కరోనా సోకిందని పది రోజుల కిందట యశోదాలో చేర్పించారు. చికిత్స పేరుతో ఇప్పటిదాకా ఎనిమిదిలక్షలు కట్టారు. నిన్న నరసింగరావు చనిపోయారని ఇంకా ఐదు లక్షలు కట్టి బాడీని తీసుకెళ్లాలంటూ ఆసుపత్రి యాజమాన్యం కుటుంబానికి సమాచారం అందించింది. దీంతో కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే వారికి అనుమానం వచ్చి మరోసారి ఎంక్వైరీ చేయడంతో నరసింగరావు బతికే ఉన్నాడని వీడియో కాల్‌లో చూపించారు యశోదా సిబ్బంది. ఆయన బతికే ఉన్నాడని తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆసుపత్రి నిర్వాకంపై ఆశ్చర్యపోయారు.