Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణాలో నడుస్తుంది రైతు ప్రభుత్వం : రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్

తెలంగాణలో రైతు ప్రభుత్వం నడుస్తుందని పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. 

తెలంగాణలో రైతు ప్రభుత్వం నడుస్తుందని పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. రామగుండం నియోజకవర్గంలోని పాలకుర్తి మండలం జయ్యారం, పుట్నూరు, కొత్తపల్లి గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యే చందర్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో రైతులు ఆత్మహత్యలు చేసుకునే వారిని... తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ సారథ్యంలో వ్యవసాయం పండుగ చేసుకునే పరిస్థితిలో ఏర్పడ్డాయని అన్నారు.