Asianet News TeluguAsianet News Telugu

సిరిసిల్ల పోలీసుల వినూత్న ప్రయోగం.. జిల్లా మొత్తం డ్రోన్ కెమెరాల నిఘా..

దేశంలోనే మొదటిసారిగా పోలీస్ పెట్రోలింగ్ వాహనాలకు డ్రోన్ కెమెరాలను అనుసంధానించిన ఘనత సిరిసిల్లకు దక్కింది.

దేశంలోనే మొదటిసారిగా పోలీస్ పెట్రోలింగ్ వాహనాలకు డ్రోన్ కెమెరాలను అనుసంధానించిన ఘనత సిరిసిల్లకు దక్కింది. వివరాల్లోకి వెడితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదటిసారిగా టి-హబ్ ఆధ్వర్యంలో ఏయిర్ సర్వ్ కంపెనీ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా జిల్లాలోని అన్ని మండలాలలో ఉన్న పోలీస్ పెట్రోలింగ్ వాహనాలకు డ్రోన్ కెమెరాలను అనుసంధానం చేశారు.  వీటి కమాండ్ కంట్రోల్ జిల్లా హెడ్ క్వార్టర్స్ లోఉంటుందని వెల్లడించిన జిల్లా ఎస్.పి.రాహుల్ హెగ్డే అన్నారు. కోవిద్-19 ఎదుర్కోవడానికి, శాంతి భద్రత పరిరక్షణలో ఇవి బాగా ఉపయోగపడతాయని అన్నారు.