Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ లాక్ డౌన్ : పనులులేక పస్తులుంటున్న కూలీలు..పోలీసులు ఏం చేశారంటే...

తెలంగాణ లాక్ డౌన్ నేపథ్యంలో రోజుకూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

తెలంగాణ లాక్ డౌన్ నేపథ్యంలో రోజుకూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి గ్రామంలో ఉండే రోజుకూలీ ధారవత్ కుమార్ కుటుంబం రెండురోజులుగా పనులు లేక పస్తులుంటోంది. తెలిసిన వారు ఈ విషయాన్ని తెలంగాణ సీఎంఓ, కేటీఆర్ లకు ట్విట్టర్ ద్వారా తెలిపారు. దీనికి స్పందించిన రాచకొండ సీపీ మహేష్ భగవత్ బియ్యం, పప్పులు, నిత్యావసర సరుకులు వారికి అందేలా చేశారు. కీసర పోలీసులు స్వయంగా వచ్చి వారికి అందించారు.