Asianet News TeluguAsianet News Telugu

గాంధీ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్ల కరోనాతో గర్భిణీ మృతి..

దూల్ పేట్ గంగాబౌలికి చెందిన వర్షాబాయి అనే గర్భిణీ గాంధీ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్ల గత రాత్రి కరోనా పాజిటివ్ తో మృతి చెందింది. 

దూల్ పేట్ గంగాబౌలికి చెందిన వర్షాబాయి అనే గర్భిణీ గాంధీ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్ల గత రాత్రి కరోనా పాజిటివ్ తో మృతి చెందింది. పదిరోజుల క్రితం ఆమె తండ్రి కరోనాతో చనిపోయాడు. అయితే అతను కరోనాతోనే చనిపోయాడన్న విషయం తెలియక బంధువులంతా చావుకు హాజరయ్యారు. దీంతో అందరికీ కరోనాసోకింది. వర్షాబాయి గాంధీకి వస్తే సరిగా ట్రీట్మెంట్ జరగలేదు. ఎమ్మెల్యే రాజాసింగ్ స్వయంగా చొరవ తీసుకుని గాంధీ సూపరింటెండెంట్ తో మాట్లాడే ప్రయత్నం చేస్తే స్పందించలేదు.