Asianet News TeluguAsianet News Telugu

పిరమాల్ గ్రూప్ : 500కోట్ల పెట్టుబడులు..600 ఉద్యోగాలు...

తెలంగాణలో పిరమాల్ గ్రూప్ ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. 

తెలంగాణలో పిరమాల్ గ్రూప్ ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. ప్రస్తుతం ఉన్న పిరమల్ ఫార్మాను రానున్న మూడు సంవత్సరాల్లో విస్తరించనుంది. దీనికోసం 500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ప్రస్తుతం తెలంగాణలో తనకున్న 14 వందల మంది ఉద్యోగులకు అదనంగా మరో ప్రత్యక్ష 600 ఉద్యోగాలు కల్పించేందుకు ఈ పెట్టుబడితో అవకాశం కలుగుతుంది. వచ్చే నెల  పిరమాల్ గ్రూప్ సీనియర్ ప్రతినిధి బృందం తెలంగాణలో పర్యటించనుంది. దావోస్లో మంత్రి కేటీఆర్ తో సమావేశం అయిన పిరమాల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమాల్, సమావేశం అనంతరం ఈ భారీ పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది.