నిషేధిత గడ్డిమందు సరఫరా చేస్తే పీడీ యాక్ట్.. కమలాసన్ రెడ్డి
నిషేధిత గడ్డి మందు సరఫరా చేస్తున్న నిందితులను కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.
నిషేధిత గడ్డి మందు సరఫరా చేస్తున్న నిందితులను కరీంనగర్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వారినుండి యాభై వేల విలువైన 100లీటర్ల గడ్డి మందు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన మాధవరావు, వరంగల్ జిల్లాకు చెందిన వేద ప్రకాష్ ఇద్దరు కలిసి గత కొద్ది రోజులుగా నిషేదిత గడ్డి మందు సరఫరా చేస్తున్నారు. నిషేధిత గడ్డి మందులు నకిలీ పత్తివిత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ పోలీస్ కమీషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో మళ్లీ అదే తరహా నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్ ను కుడా అమలు చేస్తామని స్పష్టం చేశారు.