Asianet News TeluguAsianet News Telugu

మునుగోడులో వేడెక్కిన రాజకీయం... బిజెపిలో చేరిన నాయకులకు చావుడప్పుతో శవయాత్ర

మునుగోడు : ఉపఎన్నిక నేపథ్యంలో మునుగోడులో రాజకీయాలు వాడీవేడిగా సాగుతున్నాయి. 

మునుగోడు : ఉపఎన్నిక నేపథ్యంలో మునుగోడులో రాజకీయాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ప్రస్తుతం పిరాయింపు రాజకీయాలు కొనసాగుతుండటంతో తమ లీడర్లు, కేడర్ ను కాపాడుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అయినప్పటికి కొందరు నాయకులు జంపింగ్ లు చేస్తుండటంతో వారిపై పార్టీ కేడర్ ఆగ్రహంతో రగిలిపోతోంది. ఇలా చండూరు జడ్పిటిసి కర్నాటి వెంకటేశం, గట్టుప్పల్ ఎంపిటిసి గీతా శ్రీనివాస్ లు బిజెపిలో చేరడం అధికార పార్టీ శ్రేణులకు ఆగ్రహానికి కారణమయ్యింది. దీంతో గ్రామంలో చావుడప్పుతో భారీ ఊరేగింపు శవయాత్ర నిర్వహించిన టీఆర్ఎస్ నాయకులు ఫిరాయింపుదారుల దిష్టిబొమ్మలను దగ్దం చేసారు. పార్టీకి ద్రోహం చేసిన నాయకులు గట్టుప్పల్ లో అడుగుపెడితే సహించేది లేదని టీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరించారు.