Asianet News TeluguAsianet News Telugu

వృద్దురాలిపై కోతుల దాడి... తప్పించుకోబోయి బావిలో పడి...

సిరిసిల్ల : కోతులు దాడిచేయడంతో  ఓ వృద్దురాలు బావిలో పడిపోయిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది.

సిరిసిల్ల : కోతులు దాడిచేయడంతో  ఓ వృద్దురాలు బావిలో పడిపోయిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్ గ్రామానికి చెందిన రాజవ్వ(68) ఇంటిబయట ఒంటరిగా కూర్చునివుండగా కోతుల గుంపు దాడిచేసింది. ఈ కోతుల నుండి తప్పించుకునే క్రమంలో బావిలో పడిపోయింది. ఆమె కేకలు విన్న ఇంట్లోని కుటుంబసభ్యులు బయటికి వచ్చిచూడగా వృద్దురాలు కనిపించలేదు. బావిలోంచి కేకలు వినిపించడంతో వెళ్లిచూడగా రాజవ్వ బావిమధ్యలో ఇరుక్కుని కనిపించింది. ఆమెను తాళ్ల సాయంతో బయటకు లాగి హాస్పిటల్ కు తరలించారు.