Asianet News TeluguAsianet News Telugu

కొండగట్టులో రామకోటి స్థూపం... భూమిపూజ చేసిన ఎమ్మెల్సీ కవిత

జగిత్యాల జిల్లా  ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి ఉత్తర ద్వారం ముందు  రూ.90 లక్షల వ్యయంతో నిర్మించనున్న రామకోటి స్తూపానికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత మంగళవారం భూమి పూజ చేశారు. 

జగిత్యాల జిల్లా  ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి ఉత్తర ద్వారం ముందు  రూ.90 లక్షల వ్యయంతో నిర్మించనున్న రామకోటి స్తూపానికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత మంగళవారం భూమి పూజ చేశారు. అంతకుముందు కొండగట్టు ఆంజనేయస్వామిని ఇంద్రకరణ్ రెడ్డి దంపతులతో కలిసి కవిత దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.  వేదపండితులు వేదమంత్రాలు పలుకగా, అర్చకులు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందించారు. దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన వారికి  దేవస్థాన కార్యనిర్వహణాధికారి, అర్చకస్వాములు ఆలయ మర్యాదలతో  స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాపతినిదులు, ఆధికారులు పాల్గొన్నారు.