Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్సీ కవిత ఇంటికి పోటెత్తిన కార్యకర్తలు...

హైదరాబాద్ : కల్వకుంట్ల కవిత పేరు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రముఖంగా వినిపించడం, సీబీఐ నోటీసులు జారీ చేయడంతో తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. 

హైదరాబాద్ : కల్వకుంట్ల కవిత పేరు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రముఖంగా వినిపించడం, సీబీఐ నోటీసులు జారీ చేయడంతో తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. అయితే వీటికి సమాధానం చెబుతానన్న ఆమె నేడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. దీనికోసం ఆమె ఇంటినుంచి బయల్దేరిన సమయంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆమె ఇంటి దగ్గరికి చేరుకుని మద్దతు తెలిపాయి. జై కవితక్క.. జై తెలంగాణ, కవితక్క నాయకత్వం వర్థిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ సంఘీభావం తెలిపారు.