Asianet News TeluguAsianet News Telugu

నాణ్యతా లోపం.. కూలిన మిషన్ భగీరథ వాటర్ ట్యాంకర్.. పక్కనే స్కూల్..

కట్టి ఆర్నెళ్లు కూడా కాకముందే మిషన్ భగీరథ వ్యాటర్ ట్యాంకర్ కూలిన ఘటన నాగర్ కర్నూల్ లో చోటుచేసుకుంది. 

కట్టి ఆర్నెళ్లు కూడా కాకముందే మిషన్ భగీరథ వ్యాటర్ ట్యాంకర్ కూలిన ఘటన నాగర్ కర్నూల్ లో చోటుచేసుకుంది.  అచ్చంపేట నియోజ‌క‌వ‌ర్గంలోని వంగూరు మండ‌ల ప‌రిధిలో గ‌ల చింత‌ప‌ల్లి గ్రామంలో ఇటీవ‌లే మిష‌న్ భ‌గీర‌థ కోసం ఓ వాట‌ర్ ట్యాంక్ నిర్మించారు. మొత్తం రెండు ట్యాంకుల‌ను నిర్మించ‌గా…అందులో ఒక‌టి ప‌క్క‌కు ఒరిగి ప్రమాద‌క‌ర స్థాయికి చేరింది. ప‌క్క‌నే స్కూల్ ఉండ‌టంతో ఎప్ప‌టికైనా ప్ర‌మాదం అని అధికారులు ఆ ట్యాంకును కూల్చేశారు. ఈ ట్యాంకు నిర్మాణానికి దాదాపు 
15ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చు అయి ఉంటుంద‌ని అంచ‌నా.  కాంట్రాక్ట‌ర్ల కక్కుర్తి, అధికారుల అవినీతితోనే ఇలాంటి నిర్మాణాలు జ‌రుగుతున్నాయ‌ని గ్రామ‌స్థుల‌తో పాటు ప‌లువురు ఆరోపిస్తున్నారు.