Asianet News TeluguAsianet News Telugu

అందుకేనా సీఎం కేసీఆర్ ను జైల్లో పెట్టేది..?: బండి సంజయ్ పై మంత్రి ఆగ్రహం

మహబూబ్ నగర్: దుబ్బాక సెంటుమెంట్, సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని బిజెపి నాయకులు యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. 

మహబూబ్ నగర్: దుబ్బాక సెంటుమెంట్, సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని బిజెపి నాయకులు యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. అయితే బీజేపీ కుయుక్తుల గురించి ప్రజలకు తెలుస్తున్నారని... ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని అన్నారు. బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నోరును అదుపులో పెట్టుకొని మాట్లాడాలని మంత్రి హెచ్చరించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసినందుకు సీఎం కేసీఆర్ ను జైల్లో పెడతారా..? అంటూ మంత్రి నిలదీశారు. పిచ్చి పిచ్చిగా మట్లాడితే తగిన బుద్ధి చెబుతామని మంత్రి హెచ్చరించారు. మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేకనే ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.