Asianet News TeluguAsianet News Telugu

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పుల్లలు పెట్టి.. ఇప్పుడు పోతిరెడ్డిపాడు నిర్మిస్తారా.. శ్రీనివాస్ గౌడ్

పోతిరెడ్డిపాడు అంశం పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ లో ప్రెస్ మీట్ పెట్టారు. 

పోతిరెడ్డిపాడు అంశం పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ లో ప్రెస్ మీట్ పెట్టారు. సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ కోసం గొప్ప మనసుతో గోదావరి నీళ్ళను నాగార్జునసాగర్ కి తీసుకుని వద్దామని తలిస్తే..ఏపీ సీఎం జగన్..కృష్ణా నీటిని అక్రమంగా తీసుకెళ్లేందుకు ప్రణాళిక రచించడం దారుణం అన్నారాయన. అట్లా చేస్తే.. ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకునేదిలేదు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, అపెక్స్ కమిటీ తీర్మానం లేకుండా ఇలాంటి నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా తీసుకుంటాయో చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు త్వరితగతిన పూర్తిచేసి మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో 12 లక్షల ఎకరాలకు తాగు నీరు అందేలా చర్యలు చేపడతాం అన్నారు.