పారిశుద్ధ్య కార్మికులతో సింగిరెడ్డి సహపంక్తి భోజనం
రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి మున్సిపాలిటీ పారిశుద్ధ్య సిబ్బందిని సన్మానించి వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి మున్సిపాలిటీ పారిశుద్ధ్య సిబ్బందిని సన్మానించి వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, ఎస్పీ అపూర్వరావు హాజరయ్యారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే, పారిశుద్ధ్య కార్మికులూ మనలాంటి మనుషులే, వారి శ్రమకు పాదాభివందనాలు చేసినా తక్కువే- పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని వారికి సహకరిద్దాం అని అన్నారు. ఎవరి ఇల్లు, గల్లీ, గ్రామం వారే పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పారిశుద్ధ్యం మీద పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యేక డ్రైవ్ పెట్టి పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పెంచాలన్నారు.