గీసుకొండ మృతుల కుటుంబాలకు సత్యవతి రాథోడ్ ఆర్థిక సాయం
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామంలో బావిలో పడి చనిపోయిన తొమ్మిది మంది కుటుంబసభ్యలును మంత్రి సత్యవతి రాథోడ్ పలకరించారు.
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామంలో బావిలో పడి చనిపోయిన తొమ్మిది మంది కుటుంబసభ్యలును మంత్రి సత్యవతి రాథోడ్ పలకరించారు. చనిపోయిన వారి కుటుంబాలకు మంత్రి సత్యవతి రాథోడ్ వ్యక్తిగతంగా లక్ష రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. ఆమెతో పాటు చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ 50 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. వలస కార్మికులకు ఇలా కావడం అన్యాయం అంటూ వారి మృతదేహాలను స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.