Asianet News TeluguAsianet News Telugu

మేడ్చల్ : వలసకార్మికులకు భోజనాలు పెట్టించిన కార్మికశాఖ మంత్రి

తెలంగాణ కార్మిక శాఖా మంత్రి మల్లారెడ్డి వలసకార్మికులకు భోజనాలు ఏర్పాట్లు చేశారు.

తెలంగాణ కార్మిక శాఖా మంత్రి మల్లారెడ్డి వలసకార్మికులకు భోజనాలు ఏర్పాట్లు చేశారు. మేడ్చల్ మండల్ కండ్లకోయ ఓఆర్ఆర్ వద్ద నడుచుకుంటూ వెడుతున్న వలసకార్మికుల కోసం మంత్రి తన సిబ్బందితో ఆహారఏర్పాట్లు చేయించారు. వారిని ఆపి బాగోగులు కనుక్కుని వారు వెళ్లడానికి లారీలు ఏర్పాటు చేశారు. వారికి కొంత ఆర్థిక సాయం కూడా చేశారు. పిల్లలు, మహిళలు, వృద్ధులకు పోషకాహారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డితో పాటు మున్సిపల్ చైర్మన్ దీపికా నర్సింహారెడ్డి, కౌన్సిలర్లు, మున్సిపల్, రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.