జలవిప్లవంతో పాటు.. త్వరలో మరో నాలుగు విప్లవాలు.. కేటీఆర్
సిరిసిల్ల జిల్లాలో శుక్రవారం పర్యటించిన మంత్రి కేటీఆర్ ఫీడర్ ఛానెల్ పూడిక తీత, చెక్డ్యామ్ ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
సిరిసిల్ల జిల్లాలో శుక్రవారం పర్యటించిన మంత్రి కేటీఆర్ ఫీడర్ ఛానెల్ పూడిక తీత, చెక్డ్యామ్ ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.2 కోట్లతో కొల్లమద్ది గ్రామంలో ఎగువ మానేరు ప్రధాన ఫీడర్ ఛానెల్లో పూడికతీత పనులను మంత్రి ప్రారంభించారు. నర్మాలలో రెండు చెక్డ్యామ్ ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నర్మాల గ్రామంలో రైతు వేదిక నిర్మాణానికి భూమిపూజ చేసి, అనంతరం సీసీ కెమెరాలను ప్రారంభించారు. అవెంటనే గంభీరావుపేటలో రైతువేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లమద్ది గ్రామంలోegs కార్మికులతో మాట్లాడారు. ఉపాధి హామీ పనులు చేపట్టేప్పుడు విధిగా కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. జలహితం కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని నర్మాల ప్రాజెక్టు కాల్వల పూడికతీత పనుల్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.