Asianet News TeluguAsianet News Telugu

రయ్ రయ్ మంటూ నీటిని చీల్చుకుంటూ... సరదాగా బోట్ నడిపిన కేటీఆర్

సిరిసిల్ల : బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాజకీయాలు... మంత్రిగా వివిధ శాఖల వ్యవహారాలు చూసుకుంటూ బిజీబిజీగా వుండే కేటీఆర్ ఇవాళ సొంత నియోజకవర్గంలో కొద్దిసేపు సరదాగా గడిపారు. 

సిరిసిల్ల : బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాజకీయాలు... మంత్రిగా వివిధ శాఖల వ్యవహారాలు చూసుకుంటూ బిజీబిజీగా వుండే కేటీఆర్ ఇవాళ సొంత నియోజకవర్గంలో కొద్దిసేపు సరదాగా గడిపారు. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో సిరిసిల్లలోని మిడుమానేరులో బోటింగ్ యూనిట్ ఏర్పాటుచేసారు. ఈ యూనిట్ ను పర్యాటక మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ప్రారంభించిన కేటీఆర్ ఓ బోటులో నీటిలోకి వెళ్లారు. ఈ క్రమంలో బోటింగ్ ను మరింత ఆస్వాదించేందుకు స్వయంగా స్టీరింగ్ పట్టారు మంత్రి.ఇలా కొద్దిసేపు బోట్ ను నడుపుతూ చుట్టుపక్కల ప్రకృతి అందాలను వీక్షించారు మంత్రి కేటీఆర్.

పర్యాటకులను ఆకర్షించేందుకు మిడ్ మానేరు జలాశయం వద్ద బోటింగ్ సౌకర్యాన్ని ఏర్పాటుచేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇక్కడ నీటిలో ప్రయాణిస్తూ చుట్టూవున్న అందాలను వీక్షిస్తూ బోటింగ్ చేయవచ్చని అన్నారు. 120 మంది ఒకేసారి ప్రయాణించేలా డబుల్ డెక్కర్ ఏసి క్రూయిజ్, 20 మంది ప్రయాణించేలా అమెరికన్ ప్లాటూన్ డీలక్స్, నలుగురు ప్రయాణించేలా స్పీడ్ బోట్స్ అందుబాటులో వుంటాయని తెలిపారు. 

Video Top Stories