Asianet News TeluguAsianet News Telugu

సొంత పొలంలో.. నాగలి పట్టి.. దుక్కి దున్నిన అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి..

రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి  అల్లోల  ఇంద్రకరణ్ రెడ్డి నాగలి పట్టి దుక్కి దున్నారు.

రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి  అల్లోల  ఇంద్రకరణ్ రెడ్డి నాగలి పట్టి దుక్కి దున్నారు. రోహిణీ కార్తె వానకాలం ప్రారంభంలోనే పంటలు వేయాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన స్వగ్రామం ఎల్లపల్లిలోని తన పంటపొలంలో దుక్కి 
దున్ని వరి తుకం అలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కార్తెలకు అనుగుణంగా పంటలు సాగు చేస్తే  అధిక దిగుబడులు వచ్చి రైతుకు మేలు జరుగుతుందన్నారు. సీఎం కేసిఆర్ పిలుపు మేరకు  రైతుల నుంచి కూడా విశేష స్పందన వస్తుందని తెలిపారు.