Asianet News TeluguAsianet News Telugu

జగిత్యాలలో చిరుత కలకలం.. భయాందోళనలో స్థానికులు..

జగిత్యాల జిల్లా కేంద్రంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. 

జగిత్యాల జిల్లా కేంద్రంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. జగిత్యాలలోని కొత్త బస్టాండ్ సమీపంలో వాణి నగర్, ఇతర కాలనీల్లో చిరుత పులిని చూసినట్లు స్థానికులు చెబుతున్నారు. వాణి నగర్ లో చిరుత పులి  పాదముద్రలు కూడా కనిపించాయి. ఈ సమాచారంతో అటవీశాఖ అధికారులు వాణి నగర్ చేరుకొని గాలింపు చేపట్టారు. అయితే చిరుత పులిని చూశామని స్థానికులు చెప్పడమే కానీ, దాని జాడ తెలియలేదు. అటవీశాఖ అధికారులు గాలింపు చేపట్టారు. కాలిముద్రలను ఫొటో తీసి హైదరాబాద్ లోని వన్యప్రాణి సంరక్షణ అధికారులకు పంపారు. అయితే అవి చిరుత అడుగుల్లా లేవని అడవిపిల్లి కాలి గుర్తుల్లా ఉన్నాయని వారంటున్నారు. ఇప్పటికే డ్రోన్స్ తో వెతుకుతున్నామని, ప్రత్యేక రెస్క్వు బృందాన్ని కూడా రప్పిస్తున్నామని  అటవీశాఖ అధికారి వెంకటేశ్వర్ రావు అన్నారు.

Video Top Stories