Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ టీ20 టికెట్ల లొల్లి... అభిమానులపై పోలీసులు లాఠీ చార్జ్

హైదరాబాద్ : ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 25న ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న టీ20 మ్యాచ్ టికెట్ల గందరగోళం కొనసాగుతోంది. 

హైదరాబాద్ : ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 25న ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న టీ20 మ్యాచ్ టికెట్ల గందరగోళం కొనసాగుతోంది. కొద్దిరోజులుగా టికెట్ల కోసం ఎదురుచూస్తున్న అభిమానులు 
ఇవాళ సికింద్రాబాద్ జింఖానా మైదానంలో విక్రయిస్తున్నారని తెలిసి ఎగబడ్డారు. ఇలా భారీసంఖ్యలో అభిమానులు చేరుకోవడం... టికెట్ల కోసం ఎగబడటంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఇందులో తొక్కిసలాటలో ఓ మహిళ గాయపడింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అప్రమత్తమైన పోలీసులు అభిమానులపై లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టారు.