Asianet News TeluguAsianet News Telugu

సీఎం కేసీఆర్ కు కరోనా... కోలుకోవాలంటూ సంజయ్ ప్రత్యేక పూజలు

కరోరా బారినపడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలంటూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

కరోరా బారినపడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలంటూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నర్సింగపూర్ గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో సీఎం కేసీఆర్ కు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించమంటూ ఎమ్మెల్యేతో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్, టీఆర్ఎస్ నాయకులు ఈ ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా ముఖ్యమంత్రిగా సుపరిపాలన అందిస్తూ బంగారు తెలంగాణగా మార్చారని అన్నారు. బడుగు బలహీన వర్గాలు, రైతులు, ఉద్యోగ ఉపాధ్యాయులు, విద్యార్థులు కూడా తన కుటుంబ సభ్యులుగా భావిస్తూ కేసీఆర్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతున్నారని... అలాంటిది ఆయన కరోనాబారిన పడటం బాధాకరమన్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఈ దేవున్ని కోరుకున్నట్లు ఎమ్మెల్యే సంజయ్ తెలిపారు.