కొండపోచమ్మకు చేరిన గోదావరి జలాలు.. నెరవేరిన కేసీఆర్ కల...
మెదక్ జిల్లా,కొండపోచమ్మ ఆలయంలో నిర్వహించిన చండీహోమం పూర్ణాహుతిలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొని పూర్ణాహుతి సమర్పించారు.
మెదక్ జిల్లా,కొండపోచమ్మ ఆలయంలో నిర్వహించిన చండీహోమం పూర్ణాహుతిలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొని పూర్ణాహుతి సమర్పించారు. పూర్ణాహుతి ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. తన సొంత ఖర్చులతో నిర్మించనున్న ఎర్రవల్లి రైతు వేదికకు
సీఎం భూమిపూజ చేశారు. ఆ తరువాత మర్కూర్ పంప్హౌస్ వద్ద నిర్వహించే సుదర్శనయాగంలో కేసీఆర్ దంపతులు, త్రిదండి చినజీయర్ స్వామీ పాల్గొన్నారు. ఉదయం 11:30 గంటలకు మర్కూక్ పంప్హౌస్ను ప్రారంభించారు. అనంతరం కొండపోచమ్మ జలాశయం వద్ద గోదావరి జలాలకు హారతి ఇచ్చారు.