లారీ ఢీకొని కరీంనగర్లో వివాహిత మృతి
కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారిలో శుభమస్తు ఫంక్షన్ హాల్ వద్ద శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం పాలైంది.
కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారిలో శుభమస్తు ఫంక్షన్ హాల్ వద్ద శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం పాలైంది. ఉప్పర మల్యాల గ్రామానికి చెందిన నెట్టు కొమురయ్య -కనుక దంపతులు ద్విచక్రవాహనంపై గంగాధర వైపు వెళ్తుండగా వెనక నుండి వచ్చిన లారీ ఢీకొనడంతో మహిళ రోడ్డుపై పడిపోయింది రోడ్డుపై పడ్డ కనుక పై నుండి లారీ వెళ్లడంతో మృతదేహం నుజ్జునుజ్జు అయింది గాయాలపాలైన కొమురయ్య కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.