Asianet News TeluguAsianet News Telugu

కాళేశ్వరం ఆరో ప్యాకేజీ వెట్ రన్ (వీడియో)

కాళేశ్వరం ప్రాజెక్టులోని ఆరో ప్యాకేజీలో మొదటి పంపు వెట్ రన్ విజయవంతంగా పూర్తి చేశారు. బుధవారం నాడు  ఇంజనీర్లు ప్రయోగాత్మకంగా వెట్ రన్‌ను పరిశీలించారు. ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో  తెలంగాణ సీఎం కేసీఆర్  హర్షం వ్యక్తం చేశారు. 

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని ఆరో ప్యాకేజీలో మొదటి పంపు వెట్ రన్ విజయవంతంగా పూర్తి చేశారు. బుధవారం నాడు  ఇంజనీర్లు ప్రయోగాత్మకంగా వెట్ రన్‌ను పరిశీలించారు. ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో  తెలంగాణ సీఎం కేసీఆర్  హర్షం వ్యక్తం చేశారు. 

బుధవారం నాడు  కాలేశ్వరం ప్రాజెక్టు వద్ద  నీటి పారుదల శాఖ అధికారులు, పలువురు ఇంజనీర్లు ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మొదటి పంప్ వెట్ రన్ ప్రారంభించారు.  ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఇంజనీర్లు, అధికారులను సీఎం అభినందించారు. సీఎంతో పాటు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి , మాజీ మంత్రి హరీష్ రావు కూడ అభినందించారు.

నందిమేడారం సర్జ్‌పూల్‌ నుంచి మోటార్లు నీటిని ఎత్తిపోస్తున్నాయి. సర్జ్‌పూల్‌ నుంచి ఈ నీళ్లు నందిమేడారం రిజర్వాయర్‌కు చేరనున్నాయి.
రికార్డు సమయంలో పనులను పూర్తి చేసిన  ప్రతి ఒక్కరిని అభినందించారు.