Asianet News TeluguAsianet News Telugu

వ్యవసాయ క్షేత్రంలో సేద తీరుతున్న మంత్రి సింగిరెడ్డి

ప్రధాని పిలుపు మేరకు దేశం మొత్తం జనతా కర్ఫ్యూ పాటిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రధాని పిలుపు మేరకు దేశం మొత్తం జనతా కర్ఫ్యూ పాటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వనపర్తి జిల్లా పాన్‌గల్‌‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో గడుపుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా అమలవుతున్న జనతా కర్ఫ్యూలో తాము  కూడా భాగస్వాములం అవుతున్నామన్నారు. ప్రజలందరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మనల్ని మనం కాపాడుకుందామని సింగిరెడ్డి పిలుపునిచ్చారు.