Asianet News TeluguAsianet News Telugu

మంత్రి మల్లారెడ్డిపై ఐటీ రైడ్స్ ... ఇళ్లు, కార్యాలయాల్లో 50 బృందాల సోదాలు

హైదరాబాద్ : తెలంగాణ కార్మిక శాఖ మంత్రి, మల్లారెడ్డి కాలేజీల అధినేత చామకూర మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. 

హైదరాబాద్ : తెలంగాణ కార్మిక శాఖ మంత్రి, మల్లారెడ్డి కాలేజీల అధినేత చామకూర మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామునే దాదాపు 50 బృందాలు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని మంత్రి, ఆయన కుమారులు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. కొంపల్లిలోని మెడోస్ విల్లాలో తనిఖీలు కొనసాగుతున్నాయి. అలాగే   సికింద్రాబాద్ లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో వుంటున్న మల్లారెడ్డి కొడుకు, కాలేజీల డైరెక్టర్ మహేందర్ రెడ్డి నివాసంలోనూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.