కనువిందు చేస్తున్న కైట్స్ ఫెస్టివల్
సంక్రాంతి సందర్భంగా సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో పతంగుల వేడుకలు మూడు రోజులుగా జరుగుతున్నాయి.
సంక్రాంతి సందర్భంగా సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో పతంగుల వేడుకలు మూడు రోజులుగా జరుగుతున్నాయి. 25 రాష్ట్రాలు, 20 దేశాల నుంచి కైట్ ప్లేయర్స్ తరలివచ్చారు. కైట్ ఫెస్టివల్తో పాటు వెయ్యికి పైగా రకాల స్వీట్లు కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. అన్ని రాష్ట్రాల మిఠాయిలు, స్నాక్స్తో స్టాల్స్ ఏర్పాటు చేశారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ చేసిన ఏర్పాట్లపై కైట్ ప్లేయర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉత్సవాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.