Asianet News TeluguAsianet News Telugu

పుట్టినరోజునే... రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

ఓ యువకుని పుట్టిన రోజునే విషాదం చోటుచేసుకుంది. 

ఓ యువకుని పుట్టిన రోజునే విషాదం చోటుచేసుకుంది. తన పుట్టిన రోజు సందర్భంగా స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపిన యువకుడు యాక్సిడెంట్ లో మృతి చెందాడు. మరో నలుగురు యువకులకు తీవ్ర గాయాలు కావడంతో వరంగల్ ఎంజిఎం కు తరలించారు.కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణానికి చెందిన మనిదీప్ బిటెక్ చదువుతున్నాడు. శనివారం అతడి పుట్టిన రోజు కావడంతో స్నేహితులతో రోజంతా ఆనందంగా గడిపాడు. రాత్రి డిన్నర్ చేయడానికి స్నేహితులతో కలిసి కారులో వెళుతుండగా పర్కల్ క్రాస్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న కారును వెనుక నుండి వచ్చిన లారీ ఢీ కొట్టడంతో భర్త్ డే భాయ్ మనిదీప్ అక్కడిక్కడే మృతి చెందగా మిగితా నలుగురి స్నేహితులకు తీవ్ర గాయాలపాలయ్యారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజిఎంకు తరలించారు. పుట్టిన రోజే మనిదిప్ మృతి చెందడం తో మనిదిప్ కుటుంబసభ్యులు స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు.