పట్టపగలే రద్దీ ప్రదేశంలో కాల్పులు...హైదరాబాద్ లో భారీ ఛోరీ
హైదరాబాద్లో పట్టపగలు దుండగులు రెచ్చిపోయారు.
హైదరాబాద్లో పట్టపగలు దుండగులు రెచ్చిపోయారు. కూకట్పల్లిలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కు సంబంధించిన ఏటీఎంలో డబ్బులు జమ చేస్తున్న సమయంలో సెక్యూరిటీ గార్డులపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది రక్తపు మడుగులో పడిపోగా దుండగులు పెద్ద మొత్తంలో నగదు ఎత్తుకెళ్లారు. దుండగుల కాల్పుల్లో సెక్యూరిటీ సిబ్బందికి పొట్ట భాగంలో బుల్లెట్ దూసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. రద్దీగా వుండే ప్రాంతంలో ఒక్కసారిగా కాల్పుల శబ్ధాలు వినిపించేసరికి జనం భయాందోళనలకు గురయ్యారు.