Asianet News TeluguAsianet News Telugu

ధాన్యం కొనడంలేదంటూ చొప్పదండిలో రైతుల రాస్తారోకో

చొప్పదండి మండలం చాకుంటా గ్రామంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. 

చొప్పదండి మండలం చాకుంటా గ్రామంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని, ఒకవేళ తీసుకున్నా క్వింటాలుకు 8 కిలోలు నుండి 10 కిలోలు తాలు, తరుగు పేరు మీద  రైస్ మిల్లర్లు అధికారులు కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నారని ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ కార్మిక సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో రైతులతో పాటు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుడికందుల సత్యం, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ సహాయ కార్యదర్శి కవ్వంపల్లి అజయ్, లక్ష్మణ్, దేవేందర్, తదితరులు రాస్తారోకో మద్దతుగా పాల్గొని ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Video Top Stories