Asianet News TeluguAsianet News Telugu

పల్లెప్రగతి.. వరిమడిలో నారుకు విత్తనాలు చల్ల్లిన ఎర్రబెల్లి...

పల్లె ప్రగతి లో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి జగిత్యాల జిల్లా నర్సింగపూర్ గ్రామంలో పాల్గొన్నారు.

పల్లె ప్రగతి లో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి జగిత్యాల జిల్లా నర్సింగపూర్ గ్రామంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడి పొలంలో వరి నారు కోసం వేస్తున్న మొలకలను స్వయంగా పొలం మడిలో చల్లారు. స్వతహాగా రైతు అయిన ఎర్రబెల్లి దయాకర్ రావుకు 
వ్యవసాయ పనులు చేసిన అనుభవం వుంది. ఆ అనుభవంతో మంత్రి ఎర్రబెల్లి అలవోకగా మొలకలను చల్లుతూ ఉంటే, అంతా ఆశ్చర్య పోయారు. అలాగే అక్కడి రైతులతో మాట్లాడిన ఎర్రబెల్లి, నియంత్రిత పంటలను సాగు చేయాలన్నారు. లాభసాటి పంటలతో రైతులు బాగు పడాలని సీఎం కేసిఆర్ పరితపిస్తు న్నారని రైతులకు చెప్పారు.