Asianet News TeluguAsianet News Telugu

విద్యుత్ తీగలను పట్టుకుని... ప్రాణాలమీదకు తెచ్చుకున్న యువకుడు

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం  కొత్తపల్లి గ్రామానికి చెందిన సురేష్ అనే యువకుడు మద్యం సేవించడానికి స్థానిక ఆదిత్య బార్ కు వెళ్ళి ప్రమాదానికి గురయ్యాడు. 

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం  కొత్తపల్లి గ్రామానికి చెందిన సురేష్ అనే యువకుడు మద్యం సేవించడానికి స్థానిక ఆదిత్య బార్ కు వెళ్ళి ప్రమాదానికి గురయ్యాడు. బార్ లో ఫుల్లుగా మద్యం సేవించిన అనంతరం బయటకు వచ్చిన సురేష్ విద్యుత్ తీగలకు తాకాడు. దీంతో కరెంట్ షాక్ కు గురయిన అతడు ఎగిరిపడ్డాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని యువకున్ని ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో కావాలనే విద్యుత్ తీగలను ముట్టుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సిసి కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు.