పిల్లలకు బతకడం ఎలాగో నేర్పండి.. ఆన్ లైన్ క్లాసులపై డా. విజయలక్ష్మి
కరోనా పాండమిక్ సమయంలో చిన్న పిల్లలను ఆన్ లైన్ క్లాసుల పేరుతో ఒత్తిడి తేవడం సరికాదని గాంధీ హాస్పిటల్ డాక్టర్ విజయలక్ష్మి అన్నారు.
కరోనా పాండమిక్ సమయంలో చిన్న పిల్లలను ఆన్ లైన్ క్లాసుల పేరుతో ఒత్తిడి తేవడం సరికాదని గాంధీ హాస్పిటల్ డాక్టర్ విజయలక్ష్మి అన్నారు. ఆన్ లైన్ క్లాసుల ఒత్తిడి తట్టుకోలేక 8వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. తల్లిదండ్రులు కూడా పిల్లల చదువు విషయంలో బెంగ పెట్టుకోవద్దని ఈ సమయాన్ని వారికి బతకడం ఎలాగో నేర్పించాలని అన్నారు. ఆన్ లైన్ క్లాసుల్లో కూడా అర్థం కాని చదువులు కాకుండా జీవితానికి పనికి వచ్చేవి నేర్పేలా స్కూల్స్ సిలబస్ డిజైన్ చేయాలని అన్నారు.