Asianet News TeluguAsianet News Telugu

పరిస్తితి ఇలాగే ఉంటే.. తెలంగాణ మరో ఇటలీ అవుతుంది : డాక్టర్ విజయలక్ష్మి

గత మూడు నెలలుగా కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తుండటంతో.. గాంధీ హాస్పిటల్‌లో పని చేసే డాక్టర్లపై తీవ్ర ఒత్తిడి పడుతోందని గాంధీ వైద్యురాలు విజయలక్ష్మి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

గత మూడు నెలలుగా కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తుండటంతో.. గాంధీ హాస్పిటల్‌లో పని చేసే డాక్టర్లపై తీవ్ర ఒత్తిడి పడుతోందని గాంధీ వైద్యురాలు విజయలక్ష్మి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ డాక్టర్లపై పని ఒత్తిడి తగ్గించాలని ప్రభుత్వానికి సూచించారు. గాంధీ మెడికల్ కాలేజీలో సీటు వస్తే గ్రేట్‌గా ఫీలవుతారు. కానీ రాబోయే తరంలో గాంధీలో మెడికల్ సీటు వద్దనే పరిస్థితి దాపురిస్తోంది. గాంధీ హాస్పిటల్లో మాత్రమే కరోనా పేషెంట్లకు చికిత్స ఎందుకు? ఆరోగ్య శ్రీతో ప్రయివేట్ హాస్పిటళ్లలోనూ కరోనా చికిత్స అందించొచ్చు. ఇలా చేస్తే గాంధీ హాస్పిటళ్లలో పని చేసే డాక్టర్లపై పని భారం తగ్గుతుంది.. అని ఆమె వ్యాఖ్యానించారు.

Video Top Stories