Asianet News TeluguAsianet News Telugu

దాబా ఓనర్ ను లంచం అడిగిన సుస్మిత కేసులో.. కానిస్టేబుల్ సరెండర్..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎక్సైజ్ శాఖ ఎక్సైజ్ ఎస్సై సుస్మిత కేసులో ఆమెకు సహకరించిన రాజు ఈ రోజు పోలీసులకు సరెండర్ అయ్యాడు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎక్సైజ్ శాఖ ఎక్సైజ్ ఎస్సై సుస్మిత కేసులో ఆమెకు సహకరించిన రాజు ఈ రోజు పోలీసులకు సరెండర్ అయ్యాడు. దాబా ఓనర్ ను రెండు లక్షల లంచం అడిగి చివరికి 20 వేలకు ఓకే చేసి, ఏసీబీ వలలో చిక్కుకున్న ఎక్సైజ్ ఎస్సై సుస్మిత విషయం తెలిసిందే.  ఆమెతో పాటు విధుల్లో ఉన్న రాజు అనే కానిస్టేబుల్ డబ్బులు తీసుకుంటూ, పోలీసుల్ని చూసి డబ్బుల్ని కల్లు కాంపౌండ్ లో పడేసి పరారయ్యాడు. అతని దగ్గరినుండి డబ్బులు స్వాధీనం చేసుకుని అరెస్టు చేసినట్టు  ఏసీబీ డియస్పి భధ్రయ్య తెలిపారు.