Asianet News TeluguAsianet News Telugu

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు : ఆమె ఓటు ఆమే వేసుకోలేకపోయింది...

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో ఓ విచిత్రం చోటుచేసుకుంది.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో ఓ విచిత్రం చోటుచేసుకుంది. 17వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఈ సంపల్లి నాగరాణికి ఒక్క ఓటు కూడా రాకపోవడం బాధాకరం. ఎందుకంటే పాపం ఆమె ఓటు 11వ వార్డులో ఉంది. ఆమె పోటీ చేసింది 17వ వార్డులో... 17వ వార్డు లో ఆమెను బలపరిచిన వారు కూడా ఓటు వేయకపోవడం విశేషం. వేములవాడలో 28 వార్డ్ లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీకి 2 వార్డులో తప్ప మిగతా 26 వార్డ్ లో డిపాజిట్ గల్లంతు అయింది. తెలంగాణ వ్యాప్తంగా వీచిన టిఆర్ఎస్ గాలికి వేములవాడ లో కూడా కాంగ్రెస్ అడ్రస్ గల్లంతయింది.