Asianet News TeluguAsianet News Telugu

సీఎం పదవి కోసమే... కొండగట్టులో కల్వకుంట్ల కవిత పూజలు: మేడిపల్లి సత్యం సంచలనం

జగిత్యాల: దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొండగట్టులో శ్రీరామకోటి స్థూపం‌ నిర్మించడం అభినందనీయమే...

జగిత్యాల: దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొండగట్టులో శ్రీరామకోటి స్థూపం‌ నిర్మించడం అభినందనీయమే... అయితే ఈ పని భక్తులకోసం కాకుండా స్వార్థప్రయోజనాల కోసం చేశారని టిపిసిసి అధికార ప్రతినిధి, చొప్పదండి నియోజకవర్గం ఇంచార్జ్ మేడిపల్లి సత్యం ఆరోపించారు. ఇటీవల ఉత్తర భారతదేశ పర్యటనలో భాగంగా కల్వకుంట్ల కవితకి పండితులు దోషం ఉందని చెప్పారని పేర్కొన్నారు. అందువల్లే ముఖ్యమంత్రి రేసులో కవిత కంటే కెటిఆర్ ముందంజలో ఉన్నాడని చెప్పారని... ఈ దోష నివారణ కోసమే కవిత కొండగట్టులో పర్యటించారని సత్యం సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచిరోజులు లేకపోయినా ఆగమేఘాల మీద స్థూపానికి భూమిపూజ చేయడం అందుకోసమేనని సత్యం తెలిపారు.