Asianet News TeluguAsianet News Telugu

శ్రీశైలం సన్నిధిలో కవిత దంపతులు... భ్రమరాంబ సమేత మల్లన్నకు ప్రత్యేక పూజలు

శ్రీశైలం : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శ్రీశైలం బ్రమరాంబిక మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు.

శ్రీశైలం : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శ్రీశైలం బ్రమరాంబిక మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. భర్త అనిల్ తో కలిసి శ్రీశైలం ఆలయానికి విచ్చేసిన కవితకు ఆలయ అధికారులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్వాగతం పలికారు. కవిత దంపతులు మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసారు. మల్లన్న దర్శనం అనంతరం కవిత మాట్లాడుతూ... శ్రీశైలం ఆలయానికి రావడం అద‌ృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఎన్నిసార్లు వచ్చి బ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకున్నా తనివితీరదన్నారు. రెండు రాష్ట్రాలు బాగుండాలని స్వామివారిని కోరుకున్నానని అన్నారు. తిరుపతి లాగే శ్రీశైల ఆలయం కూడా మరింత అభివృద్ది చెందాలని కోరుకుంటున్నానని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.